కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ కు గాయాలు

కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్కు రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం అలహబాద్లో ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్లో వాహనాలు ఒకదాంతో మరొకటి ఢీకొన్నప్పుడు ఆమె స్వల్పంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని.. పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.