హిందుస్థాన్ అంటే హిందువులు ఉండే దేశం

వాస్తవిక దృక్పథంతో ఒక యుపి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు మతం రంగు పులుముతున్నారు. "మన దేశం హిందుస్థాన్, ఇక్కడ నివసించేవారంతా హిందువులే. హిందుస్థాన్ అంటే హిందువులు ఉండే దేశం. ముస్లింలకే గత ప్రభుత్వాలు పెద్దపీట వేశాయి. నేడు అందరూ సమాన అవకాశాలను ఎలాంటి వివక్ష లేకుండా పొందుతు న్నారు." అని ముజఫర్నగర్లో ఓ కార్యక్రమంలో ఉత్తర్ప్రదేశ్ కౌతాలి ఎమ్మెల్యే విక్రమ్ సైనీ (బిజెపి) వ్యాఖ్యానించారు. గతంలోనూ సైనీ ఇటువంటి స్పష్టమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. 2013 ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో జాతీయ భద్రతా చట్టం కింద ఆయన్ని అరెస్ట్ చేశారు కూడా.