బ్రహ్మానందానికి జీవన సాఫల్య పురస్కారం

తెలుగు అకాడమీ 29వ వార్షికోత్సవం సందర్భంగా దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో హాస్య నటుడు బ్రహ్మానందానికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ఈ సందర్భంగా ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. సామాజిక సేవలో గురుప్రసాద్, విద్యారంగంలో రావూరి వెంకట స్వామి, వైద్య రంగంలో దశరథ రామారెడ్డి, ఆర్థిక రంగంలో మహేశ్ వై.రెడ్డి కూడా పురస్కారాలు అందుకున్నారు. సినీ నటులు మురళీ మోహన్, తనికెళ్ల భరణి, అలీ, రవిబాబు, సాయికుమార్లకు కూడా పురస్కారాలను అందజేశారు. అసోం గవర్నర్ జగదీశ్, కేంద్రమంత్రి మహేశ్ శర్మ, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ పిఎస్.నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.