గురువాయూర్ లో ఆరెస్సెస్ కార్యకర్త హత్య

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గురువాయూర్లోని నెన్మిని వద్ద ఆరెస్సెస్ కార్యకర్త పి. ఆనంద్ ను ఆదివారం మధ్యాహ్నం కొందరు కత్తులతో పొడిచి చంపారు. మోటారుబైక్పై వెళుతున్న ఆనంద్ ను గుర్తుతెలియని దుండుగులు కత్తులతో దాడిచేసి పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ ఆనంద్ను ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు విడిచాడు. మూడేళ్ల కిందటి సీపీఎం కార్యకర్త కాశీం హత్యకేసులో ఆనంద్ నిందితుడు. బెయిల్పై ఉన్న అతడిపై సీపీఎం కార్యకర్తలే దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. కేరళలో ఆరెస్సెస్ వారిపై సీపీఎం రాజకీయ కక్ష సాధింపుగా దాడులకు, అణచివేతకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. రాజకీయ హత్యలకు నెలవుగా మారిన కేరళలో అధికార సీపీఎంకు వ్యతిరేకంగా ఇటీవల బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా జనరక్షణ యాత్రను కూడా చేపట్టింది. ఈ యాత్రలో బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా పాల్గొన్నారు. అది జరిగి నెల కూడా కాకముందే మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్య జరగడం కలకలం రేపుతోంది.